రాష్ట్రంలో ఏడు లక్షల పెన్షన్లు తొలగించామన్నది అబద్ధం: మంత్రి బొత్స

  • మా ప్రభుత్వంపై బురదజల్లాలని బాబు చూస్తున్నారు
  • పింఛన్ల సంఖ్యను తగ్గించాలన్న ఆలోచన మాకు లేదు
  • కొత్తగా ఆరు లక్షల మందికి పైగా పింఛన్లు ఇచ్చాం
రాష్ట్రంలో ఏడు లక్షల పెన్షన్లు తొలగించామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీ సచివాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం ఆయన చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు.

పింఛన్ల సంఖ్యను తగ్గించుకోవాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. కొత్తగా ఆరు లక్షల మందికి పైగా పింఛన్లు ఇచ్చామని, పాతవారిలో 4,16,034 మందిని పింఛన్లకు అనర్హులుగా గుర్తించామని, పున:పరిశీలన చేసి ఇందులో పింఛన్లకు అర్హులైన వారు ఉంటే ఇస్తామని, ఈ విషయమై వార్డు వాలంటీర్లు ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం పేదల కోసం ఉన్న ప్రభుత్వం అని, పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అంకితభావంతో పనిచేస్తుందని చెప్పారు.
Go Back to Shorts
Botsa Satyanarayana Satyanarayana
YSRCP
Chandrababu
Telugudesam
Pensions

More Telugu News